ముంబై: దక్షిణ ముంబైలోని 64 అంతస్తులు ఉన్న ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. లాల్బాగ్ ప్రాంతంలో ఉన్న ఆ బిల్డింగ్లోని 19వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. అవిగ్న పార్క్ సొసైటిలో ఆ బిల్డింగ్ ఉన్నది. 19వ ఫ్లోర్లో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటన వల్ల జరిగిన నష్టం గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అవిగ్న పార్క్ అపార్ట్మెంట్ ప్రమాదంలో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ ప్రమాద స్థలికి చేరుకున్నారు.