లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఢిల్లీ – లక్నో శతాబ్ది ఎక్స్ప్రెస్ జనరేటర్ కార్లో మంటలు చెలరేగాయి. దీంతో స్పందించిన రైల్వే సిబ్బంది వెంటనే సదరు బోగీ నుంచి రైలును విడదీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ఉదయం 6.45 గంటలకు సమయంలో సమయంలో మంటలు చెలరేగాయి. బోగీలో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బోగీ సామగ్రి ఉండడంతో అగ్నికి ఆహుతైంది. తలుపు మూసుకుపోవడంతో మంటలను ఆర్పేందుకు పగులగొట్టాల్సి వచ్చింది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ నెలలో 13న సైతం డెహ్రాడూన్ – ఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్ కోచ్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.