ఆది సాయికుమార్ హీరోగా కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సునీల్ కీలక పాత్రను పోషించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. హీరోగా ఆదిని కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. సునీల్ పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వెండితెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని సరికొత్త పాయింట్తో కల్యాణ్ ఈ కథను సిద్ధంచేశారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్, సినిమాటోగ్రఫీ: బాల్రెడ్డి.