న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బహుళ అంతస్తులోని నాలుగో ఫ్లోర్లో అగ్నిప్రమాదం సంభవించి ఒకరు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.