న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని అంతరాష్ట్ర బస్ టెర్మినల్లో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. బస్ టెర్మినల్లోని ఆరో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి.
మంటలను ఆర్పివేసేందుకు తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.