ముంబై : మహారాష్ట్ర పాల్ఘడ్ జిల్లాలోని వాంఘోస్లో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. విశాల్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫ్యాక్టరీలోని రసాయనాలు పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పేలుడు శబ్దాలు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.