న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై శుక్రవారం సీబీఐసీ ఈ వివరణ ఇచ్చింది. ప్రభుత్వ నిధులు లేదా కార్పొరేట్ విరాళాల ద్వారా అమలయ్యే మధ్యాహ్న భోజన పథకంతో సహా ప్రాధమిక విద్యా సంస్థలకు చేసే క్యాటరింగ్ సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు వుంటుందని బోర్డు తెలిపింది. అంగన్వాడీ కూడా విద్యా సంస్థ (ప్రాధమిక పాఠశాల) నిర్వచనం కిందే వస్తుందని, అందుచేత జీఎస్టీ మినహాయింపు దీనికీ వర్తిస్తుందని సీబీఐసీ వివరించింది.