న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ నడిబొడ్డున ఉన్న సఫ్దర్జంగ్ విమానాశ్రయంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయం ఐటీ బిల్డింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకోగానే ఢిల్లీ ఫైర్ సర్వీస్ కు చెందిన ఆరు అగ్నిమాపక యంత్రాలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన రెండు ఫైర్ బ్రిగేడ్స్ ను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడైంది. ఇక సఫ్దర్జంగ్ విమానాశ్రయాన్ని ఏఏఐ నిర్వహిస్తోంది.