హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 15: నగరంలో గంజాయి గుప్పుమంటోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ముఠాలు యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నాయి. జిల్లా సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్గఢ్, ఇతర రాష్ర్టాలు, నగరాల నుంచి దందా యథేచ్ఛగా సాగుతోంది. హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పలు బార్లు, రాత్రివేళలో పెద్దమ్మగడ్డ పోతన కళాశాల, నయీంనగర్, కిషన్పురలోని పలు ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం గుట్టుగా సాగుతున్నట్లు సమాచారం.
యువతే లక్ష్యంగా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమాయక యువతను లక్ష్యం గా చేసుకుని కొందరు వ్యాపారులు గంజాయి మాఫియా సాగిస్తున్నారు. ఉన్నత, మధ్యతరగతి యువత సరదాగా ప్రారంభిస్తున్న గంజాయి వాడకం క్రమేణా వారిని బానిసలుగా మారుస్తోంది. గంజాయి మత్తులోరాత్రుళ్లు బైక్ రేసింగ్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా వారి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. కొందరు నేరస్తులుగా మారుతున్నారు. గంజాయి విక్రయించే ముఠాలు మాత్రం పోలీసులకు దొరక్కుండా విభిన్న రూపాల్లో తరలిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గంజాయి మాఫియాను కూకటివేళ్లతో సహా కూల్చివేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
సాగు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు : మంత్రి గంగుల
70 ఏండ్లకూ ఎన్పీఎస్లో చేరొచ్చు.. ఎందుకంటే!