ముంబై : వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోవడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతం థానే జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..థానేలోని మంపదగోవ్ కు చెందిన లక్ష్మీ పాటిల్ (22) తన భర్త ప్రవీణ్ పాటిల్ (30) కనిపించడంలేదని జూన్ 4న ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా లక్ష్మీకి ఇటీవల అరవింద్, సన్నీ సాగర్ అనే వ్యక్తులతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారగా లక్ష్మీ, అరవింద్ ల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
అరవింద్ తో లక్ష్మి వివాహేతర సంబంధం ప్రవీణ్ కు తెలియడంతో భర్తను అంతమొందించాలని ఆమె నిర్ణయించుకుంది. అరవింద్, లక్ష్మి కలిసి ప్రవీణ్ ను దారుణంగా కొట్టి ఊపిరిఆడకుండా చేసి హత్య చేశారు. ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి భర్త శవాన్ని 36 కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్లి కల్వర్ట్ లో పడేసింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ప్రవీణ్ మృతదేహాన్ని వెలికితీశారు.