పుణే : పుణే నగరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) భవనంలో ఇవాళ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్రి ప్రమాదం సంభవించింది. భవనం నుంచి పొగలు రావడంతో గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్సర్క్యూటే కారణం కావచ్చని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రతిష్టాత్మక సంస్థ భవనంలో అగ్ని ప్రమాదం జరగడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.