లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలోని ప్రయాగరాజ్లో నిర్వహించిన ర్యాలీలో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తాము ఓవైసీ ర్యాలీకి కేవలం వంద మంది పాల్గొనేందుకు అనుమతి ఇవ్వగా పెద్దసంఖ్యలో ప్రజలను అనుమతించారని, ఇది కొవిడ్-19 నిబంధనల ఉల్లంఘనేనని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది.
అసదుద్దీన్ ఓవైసీ శనివారం ప్రయాగరాజ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక యూపీలో ఓవైసీ సభలకు సంబంధించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదవడం ఇది మూడవసారి. మరోవైపు ప్రయాగరాజ్ ర్యాలీలో జైలులో ఉన్న మాఫియా డాన్, మాజీ ఎంప అతిక్ అహ్మద్ భార్య పర్వీన్ పాల్గొన్నారు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏఐఎంఐఎం టికెట్పై కాన్పూర్ నుంచి పోటీ చేస్తానని ఆమె సంకేతాలు పంపారు.