లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా 11 మందిపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లఖింపూర్ ఖేరిలో ఆదివారం ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించడం, ఆ తర్వాత చెలరేగిన అల్లర్లలో మరో నలుగురు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ ఘటన నేపధ్యంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీని సీతాపూర్ గెస్ట్హౌస్లో గత రెండు రోజులుగా నిర్బంధించారు. ఇక ఘటనా ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకూ ఎందుకు సందర్శించలేదని ప్రియాంక ప్రశ్నించారు. లఖింపూర్ ఖేరిలో హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.