జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 23: కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్నప్పటికీ అభివృద్ధి ఆగకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిధులిస్తూ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొ న్నారు. జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతేడాది సైతం ఇతర రాష్ర్టాల వలస కూలీలు జిల్లాలో ఉండగా వారిని సైతం ఆదుకుని మా నవత్వం చాటుకున్నామన్నారు. ఏడాది కాలంలో ప్రైవేట్ టీచ ర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, వారికి సైతం రూ.2వేల నగదు సాయంతో పాటు 25కిలోల సన్నబియ్యం అందించి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తున్నదని వివరించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని, విధిగా మాస్కులు ధరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. అనంతరం వార్డులో హై పోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయగా ఎమ్మెల్యే పరిశీలించా రు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీశ్, గుగ్గిళ్ల హరీశ్, కప్పల శ్రీకాంత్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక, ప్రవీణ్, రవి, వంశీ, నవీన్, భరత్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం కార్యవర్గం
జగిత్యాల రూరల్, ఏప్రిల్ 23: జగిత్యాల పట్టణ పూసల సం ఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు చేని నగేశ్, గౌరవాధ్యక్షుడు చేని తిరుమలేశ్, వ ర్కింగ్ ప్రెసిడెంట్ కావేటి వెంకన్న, జగిత్యాల పట్టణాధ్యక్షుడు చేని కృష్ణ, ఉపాధ్యక్షులు మడత శంకర్, పసుపులేటి పుల్ల య్య, ప్రధాన కార్యదర్శి పన్నీరు జీవన్, కోశాధికారి తన్నీరు శివకుమార్, సహాయ కార్యదర్శి చేని యాదగిరి, డైరెక్టర్లు కావేటి నవీన్, చేని పెద్ద తిరుపతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీతారాంపల్లిలో తలలేని పసికందు మృతదేహం లభ్యం
నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు