నిర్మల్ బస్ డిపో వద్ద జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు
నిర్మల్ అర్బన్, మే1 : మేడేను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బస్డిపో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సీఎస్ నారాయణ కార్మిక జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని త్యాగాల చౌక్ వద్ద మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ కార్మిక జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, శానిటరీ ఇన్ స్పెక్టర్ రవీందర్, ఫయాజ్, నారాయణ, శ్రీనివాస్ చారి, మసీరొద్దీన్, సతీశ్, జయాకర్, రాజన్న, రామ్లక్ష్మణ్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖా నలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి కార్మిక జెండాను ఎగురవేశారు. సంఘ నాయకులు శ్రీనివాస్చారి, నారాయణ, మహిమూద్ పాల్గొన్నారు. సివిల్ సప్లయ్ గోదాం వద్ద మేడేను సివిల్ సప్లయ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జెండాను ఎగురవేశారు. నాయకులు జీఎస్ నారాయ ణ, భీంరెడ్డి, శంకర్, రాజేశ్, మసియొద్దీన్, రమేశ్, లక్ష్మణ్, లింగమ్మ, పుండలిక్ పాల్గొన్నారు. భగత్సింగ్ భవనంలో మేడే జెండాను ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రాజన్న ఎగురవేశారు. సోఫినగర్ శివాజీ బీడీ యాజమాన్యం ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద మేడే ఉత్సవాలను నిర్వహించారు. నాయకులు బక్కన్న, రాంలక్ష్మ ణ్, లక్ష్మి, సాయన్న, లక్ష్మణ్, చిన్నయ్య, మురళి, గంగామణి, కమల, విజయ, గంగాధర్, అశోక్ పాల్గొన్నారు.
ముథోల్లో..
ముథోల్, మే, 1 : ముథోల్తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో మే డేను సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించా రు. బస్టాండ్ సమీపంలో వ్యవసాయ కార్మిక సంఘం మం డలాధ్యక్షుడు గంధం లింగన్న ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. నాయకులు తదితరులు ఉన్నారు.
భైంసాలో..
భైంసా, మే 1 : పట్టణంలో మే డేను బీడీ కామ్గార్ యూనియన్, జనసేన, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. బీడీ కామ్గార్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కానోల్ల సందేశ్, కార్యదర్శి బచ్చోల్ల ముత్తన్న, నాయకులు రాజు, హరిత, గంగాధర్, దినాజీ, సుంకెట మహేశ్బాబు, తదితరులు ఉన్నారు.
ఖానాపూర్లో..
ఖానాపూర్ టౌన్, మే1 : పట్టణంలో మేడేను కార్మిక సం ఘాల నాయకులు జరుపుకున్నారు. కరోనా వైరస్ కారణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదాంల హమాలీ సంఘం అధ్యక్షుడు పిట్టల భీమేశ్ ఏఐటీయుసీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యానగర్లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య మేడే పతాకాన్ని ఎగురవేశారు. కార్మిక సంఘ నాయకులు ఎలగోండ శ్రీనివాస్, జోగు చిన్న నర్సయ్య, కీర్తి స్వామి, బెర మొగిళి పాల్గొన్నారు.
దస్తురాబాద్లో..
దస్తురాబాద్, మే 1 : దస్తురాబాద్, బుట్టాపూర్, మున్యాల తండా, ఆకొండపేట తదితర గ్రామాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మేడేను నిర్వహించారు. మేడే జెండాను నాయకులు ఆవిష్కరించారు. నాయకులు బొమ్మెన సురేశ్, దుర్గం నూతన్ కుమార్, డాకురి తిరుపతి, చంద్రకాంత్, శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కడెంలో..
కడెం, మే 1 : మే డేను కడెంలో నిర్వహించారు. బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యం లో కార్మిక జెండాను ఆవిష్కరించారు. బీసీపీ జిల్లా కార్యదర్శి పసుల వెంకన్న, న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు సునారికారి రాజేశ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.