సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం.07644 (కాకినాడ పోర్టు- చెంగల్పట్లు ఎక్స్ప్రెస్), రైలు నం. 02714 (నాగల్సోల్-నర్సాపూర్), రైలు నం.07201 (గుంటూరు-సికింద్రాబాద్), రైలు నం.07222 (లోకమాన్య తిలక్- కాకినాడ పోర్టు), రైలు నం.07480 (పూరీ-తిరుపతి), 07482- బిలాస్పూర్- తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు 02718 (విజయవాడ-విశాఖపట్నం), 02717 (విశాఖపట్నం-విజయవాడ), 02711 (విజయవాడ-చెన్నై సెంట్రల్) రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేశామని తెలిపారు. వీటిని ప్రయాణికులు గమనించి ప్రయాణాలు చేయాలని సూచించారు. మార్పులు చేసిన రైళ్ల వేళలు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ‘హమ్ సఫర్ స్పెషల్ క్లోన్’ రైలును జూన్ 30వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్- ధన్పూర్ రైలు (02787) ప్రతి రోజు ఉదయం 6.15గంటలకు బయలు దేరుతుంది. తిరిగి ధన్పూర్ నుంచి ఉదయం 11.00 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో మార్చి 30వరకు నడుపాలని గతంలో నిర్ణయించారు. అయితే తాజాగా ఏప్రిల్ 1నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.