ముంబై: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్లో సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా ఒకడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్కు ఆడుతున్న డివిలియర్స్.. 14వ సీజన్ మొదలయ్యే ముందు తన ఫేవరెట్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ టీమ్ను ప్రకటించాడు. అయితే ఇందులో అత్యధిక పరుగుల లిస్ట్లో రెండో స్థానంలో ఉన్న సురేశ్ రైనా, అత్యధిక వికెట్ల వీరుడు లసిత్ మలింగలకు మాత్రం చోటు దక్కకపోవడం విశేషం.
ఐపీఎల్లో డివిలియర్స్.. కోహ్లి కెప్టెన్సీలో ఆడుతున్నాడు. కానీ తన టీమ్లో మాత్రం కెప్టెన్సీని ఎమ్మెస్ ధోనీకి అప్పగించడం విశేషం. అతనితోపాటు ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా జట్టులో చోటు దక్కింది. ఇక నలుగురు విదేశీ ప్లేయర్స్ విషయానికి వస్తే.. రషీద్ ఖాన్, బెన్ స్టోక్స్, కాగిసో రబాడాలను ఎంపిక చేసిన ఏబీ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే ప్లేయర్ను కచ్చితంగా చెప్పలేకపోయాడు.
ఈ స్థానంలో తనను లేదంటే కేన్ విలియమ్సన్ లేదా స్టీవ్ స్మిత్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. డివిలియర్స్ టీమ్లో ఓపెనర్లు సెహ్వాగ్, రోహిత్ శర్మ కాగా.. మూడో స్థానంలో కోహ్లి, ఐదో స్థానంలో బెన్ స్టోక్స్, ఆరో స్థానంలో ధోనీ, ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదో స్థానంలో రషీద్ ఖాన్, 9లో భువనేశ్వర్, పదిలో కాగిసో రబాడా, 11లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.