జహీరాబాద్, మే 10 : కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం జహీరాబాద్ హుగ్గెల్లి చౌరస్తాలో ఉన్న కల్వరీ టెంపుల్ను ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ రాజర్షిషాతో కలిసి పరిశీలించి 100 పడుకల ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఆదుకునేందుకు కల్వరీ టెంపుల్ వారు ముందుకొచ్చారన్నారు. కరోనా బాధితులకు ఉచిత భోజనం, వైద్య సదుపాయలు, ఆక్సిజన్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కరోనా బాధితులకు 24 గంటలు వైద్యం అందించేందుకు కల్వరీ ప్రార్థన మందిరంలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఐసొలేషన్ కేంద్రంలో కరోనా బాధితులకు రోగనిరోధక శక్తి పెంచే పదార్థాలు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ ఉచితంగా అందించేందుకు కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్కుమార్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. వారి వెంట ఆర్డీవో రమేశ్బాబు, జహీరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శంకర్, కల్వరీ టెం పుల్ ప్రతినిధులు సుమన్, సుధీర్, సోలమన్ ఉన్నారు.