లక్నో: గతేడాది లాక్డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చిన బీహార్కు చెందిన ‘Cycle girl’ జ్యోతి కుమారి తండ్రి గుండెపోటుతో మరణించారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో జ్యోతి కుమారి.. తన తండ్రి మోహన్ పాశ్వాన్ను హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్లోని దర్భాంగాకు సైకిల్పై తీసుకువచ్చింది. పాశ్వాన్ను సైకిల్పై వెనక కూర్చోబెట్టుకుని మొత్తం 1,100 కి.మీ. దూరం ప్రయాణించింది. దీంతో ఆమె మీడియా హెడ్లైన్స్లో నిలిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది తర్వాత ఆయన నిన్న గుండె పోటుతో దర్భంగాలో చనిపోయారు.
మోహన్ పాశ్వాన్ గురుగ్రామ్లో ఈ-రిక్షా నడిపేవారు. దేశవ్యాప్త కరోనా లాక్డౌన్ వల్ల రిక్షా యజమాని దానిని తీసుకున్నాడు. దీంతో ఆయనకు ఉపాధిలేకుండా పోయింది. పాశ్వాన్ కాలికి గాయం కావడంతో ఆయన బాగోగులు చూడటానికి 16 ఏండ్ల జోత్యి గురుగ్రామ్కు వెళ్లింది. అదే సమయంలో లాక్డౌన్ రావడం.. చేసేందుకు పనుల్లేక జీవనం కష్టంగా మారింది. దీనికితోడు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో సైకిల్పై సొంతూరుకు చేరుకున్న విషయం తెలిసిందే.