చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రల్లో నటిస్తున్న రామ్చరణ్, పూజాహెగ్డే జంట కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘ఆయుధమైనా..అమ్మాయి అయినా..సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది..ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ఈ పోస్టర్పై ట్విట్టర్లో వ్యాఖ్యానించారు చిరంజీవి. ధర్మస్థలి అనే ప్రాంతం నేపథ్యంలో నడిచే ఈ కథలో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్గా రెండు భిన్న కోణాల్లో సాగే పాత్రల్ని పోషిస్తున్నారు. సిద్ధ పాత్రలో రామ్చరణ్, ఆయనను జోడీగా నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే కనిపించనుంది.