శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో శాంతి కోసం పాక్తో మరోసారి చర్చలు జరుపాలని, అప్పటి వరకు ఈ ప్రాంతంలో శాంతి ఉండని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పాకిస్తాన్ హక్కులను భారతదేశం స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. ఆదివారం ఆయన పూంచ్లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
జమ్మూ కశ్మీర్పై కేంద్రం నిజాయితీగా లేదని ఆరోపించారు. ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేసి ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిందన్న ఆయన.. ఒక వేళ ఎన్సీ అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరిస్తుందన్నారు. ‘భారత్ తాను స్వాధీనం చేసుకున్న పొరుగు దేశం హక్కులను పునరుద్ధరించాలి’ అన్నారు. 1947లో పాక్ మూర్ఖంగా ఉండకపోతే.. సంస్థానంలో చివరి పాలకుడు మహారాజా హరిసింగ్ జమ్మూకాశ్మీర్ను స్వతంత్రంగా ఉంచేవాడని పేర్కొన్నారు.