రైతుల ట్రాక్టర్ పరేడ్కు అనుమతి

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో కిసాన్ గణతంత్ర పరేడ్కు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. రైతుల ట్రాక్టర్ పరేడ్ను రిపబ్లిక్ డే రోజున నిర్వహిస్తామని స్వరాజ్ ఇండియాకు చెందిన యోగీంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీ పోలీసులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని, బారికేడ్లు తొలగించగానే రైతులు నగరంలో అడుగుపెడతారని అన్నారు. పరేడ్ రూట్మ్యాప్పై పోలీసులు, రైతుల మధ్య అంగీకారం కుదిరిందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని, ఆపై ఏకాభిప్రాయం దిశగా చర్చలు కొనసాగిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రిపబ్లిక్డే నాడు ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో రైతులు రాజధాని సరిహద్దులకు చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ శ్రీణులు సైతం ఈ ర్యాలీకి మద్దతుగా తరలివచ్చాయి. శాంతియుతంగా పరేడ్ నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సు
- పాలమూరు కోడలిని ఆశీర్వదించండి
- ‘ప్రగతి’ పనుల్లో జిల్లా ముందుండాలి
- విరాట్ @100 మిలియన్ల ఫాలోవర్స్
- బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘన: ఈసీకి బీజేపీ లేఖ
- బెంగాల్ పొత్తులు నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
- ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల బిడ్లు!