ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
30 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
కరీమాబాద్, మే 28 : కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరమ ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. శుక్రవారం పెరుకవాడలోని ఎమ్మెల్యే నివాసంలో 23వ డివిజన్కు చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథ కం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలగం లీలావతి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే రాజయ్య
వేలేరు, మే 28 : సంబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పే ర్కొన్నారు. శుక్రవారం వేలేరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి అధ్యక్షతన ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చాడా సరిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ -1 ఈ సంధ్య, సర్పంచ్ మినుకూరి అంజమ్మ, రెవెన్యూ అధికారి జాఫర్ పాల్గొన్నారు.
ధర్మసాగర్: మండలంలోని నర్సింగరావుపల్లె, ఉనికిచర్ల, దేవు నూర్ గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే రాజయ్య హన్మకొండ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ బండారి రవీందర్, వైఎస్ చైర్మన్ యాద కుమార్, ఇంగే రవి, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు మైస ఎలీయా, కుమార్ పాల్గొన్నారు.