అత్యవసర వాహనాలకే అనుమతి
కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన
కృష్ణ, మే 24 : కర్ణాటక-తెలంగాణ సరిహద్దు అయిన మండలంలోని గుడెబల్లూర్ గ్రామం వాసునగర్, చేగుంట గ్రామ అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సోమవారం కలెక్టర్ హరిచందన, ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్, యాద్గిర్ జిల్లాల్లో కరోనా రోజు రోజుకూ విస్తరించడడంతో అక్కడ నుంచి అధిక సంఖ్యలో వస్తుండడం వల్ల ఇక్కడి ప్రజలకు ఎలాంటి వైరస్ సోకకుండా ఉండేందుకు చెక్పోస్టుల వద్ద వాహనాలకు అనుమతి లేద ని పేర్కొన్నారు. అత్యవసర పని నిమిత్తం వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై మురళి, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పరిశీలన
నారాయణపేట రూరల్, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన జిలాల్పూర్, ఏక్లాస్పూర్ చెక్పోస్టులను సోమవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పరిశీలించారు. చెక్పోస్టుల వద్ద ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పాసులు ఉంటేనే జిల్లాలోకి అనుమతించాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో ఎంత జనాభా ఉంది, ఎవరైనా కొవిడ్ చికిత్స పొందుతున్నారా, ఆశ కార్యకర్తలు గ్రా మంలో పర్యటిస్తున్నారా, కార్యదర్శి రోజు విధులకు హాజరవుతున్నారా అని గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాస్కులు ధరించాలని, అనవసరంగా బయట తిరుగరాదన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్, కొవిడ్ కేర్ ప్రత్యేక అధికారి శ్రీరాం, మున్సిపల్ కమిషనర్ భాస్కర్రెడ్డి, సీఐ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.