నిజామాబాద్ : మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని తెలంగాణ పోలీసులు సోమవారం మూసివేశారు. కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తెలంగాణలోకి రాకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనక్కు పంపారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్రంగా ఉండటంతో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కట్టడికి వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లఘించి సరిహద్దు దాటేందుకు యత్నిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.