హైదరాబాద్ : ఓల్డ్ బోయిన్పల్లిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఓ బాలిక అదృశ్యమైంది. మంగళవారం తన ఫ్రెండ్స్తో ఆడుకునేందుకు బయటకు వెళ్లిన దియా(11) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో దియా తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. కానీ బాలిక కనిపించలేదు. చేసేదేమీ లేక బాధిత కుటుంబ సభ్యులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.