సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా పతకాలు పొందిన వారిని నగర పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీఎం సర్వోన్నత పోలీస్ పతకం ఒకటి, మహోన్నత సేవా పతకాలు 2, ఉత్తమ సేవా పతకాలు 9, మరో 75 మంది సేవా పతకాలు పొందారని ఇందులో అదనపు డీసీపీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ ర్యాంకు వరకు ఉన్న అధికారులు ఉన్నారని సీపీ తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 87 మంది పురష్కారాలు పొందారని చెప్పారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 35మంది అధికారులకు పతకాలు వరించాయి. వారిని సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం అభినందించారు. ఇందులో రెండు ఉత్తమ సేవ, 33 సేవా పతకాలు అందుకున్న వారు ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా కమిషనరేట్ పరిధిలో 35 మంది అవార్డులకు ఎంపిక కావడం ఇదే మొదటి సారి అని తెలిపారు.