న్యూఢిల్లీ : ఈ నెల 26 న రైతులు దేశవ్యాప్తంగా బ్లాక్ డే చేపట్టాలని నిర్ణయించారు. యునైటెడ్ కిసాన్ మోర్చాకు 12 ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించనున్నది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలు ఆరు నెలలకు చేరుకున్నాయి.
కొత్త వ్యవసాయ చట్టాల సమస్యపై రైతు సంస్థలు- ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రతిష్టంభన నిలిచిపోయినట్లు లేదు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు నాయకులకు మరోసారి ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించింది. మే 26 న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రకటించిన యునైటెడ్ కిసాన్ మోర్చా నిర్ణయానికి కాంగ్రెస్ సహా 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. మే 26 నాటికి రైతు ఉద్యమం ప్రారంభమై ఆరు నెలల కాలం పూర్తవుతుంది.
యునైటెడ్ కిసాన్ మోర్చాకు మద్దతుగా 12 ప్రతిపక్ష పార్టీలు తాజా ప్రకటన విడుదల చేశాయి. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మే 12 న రాసిన లేఖను మరోసారి గుర్తుచేశాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా బ్లాక్ డేకు మద్దతుగా సోనియా గాంధీ (కాంగ్రెస్), హెచ్డీ దేవెగౌడ (జేడీ-ఎస్), శరద్ పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఉద్దవ్ ఠాక్రే (శివసేన), ఎంకే స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), ఫరూక్ అబ్దుల్లా (పీపుల్స్ కాన్ఫరెన్స్), అఖిలేష్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), తేజశ్వి యాదవ్ (ఆర్జేడీ), డీ రాజా (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం) ఉన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా నవంబర్ 28 నుండి ఢిల్లీ-ఎన్సీఆర్ సరిహద్దులో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం- రైతు సంస్థల మధ్య ఇప్పటివరకు 12 రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే, వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన మాత్రం ముగియలేదు.
చైనా నుంచి రక్షణకు జపాన్ సైనిక విన్యాసాలు
జెరూసలెంలో తెరుచుకున్న మౌంట్ హోలీ టెంపుల్
ఖలీస్తాన్ టైగర్ ఫోర్స్తో సంబంధమున్న ఇద్దరు అరెస్ట్
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..