న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి తండ్రి సిసిర్ కుమార్, సోదరుడు దిబ్యేందు అధికారికి కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. వీరిద్దరూ పార్లమెంటు సభ్యులే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో సిసిర్ కుమార్, దిబ్యేందుకు వై ప్లస్ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సువేందు అధికారికి సీఆర్పీఎఫ్ ‘జెడ్’ క్యాటగిరీ భద్రతను ఇప్పటికే కేటాయించారు.
కాంతి లోక్సభ సీటు నుంచి సిసిర్ కుమార్ అధికారి ఎంపికవగా, దిబ్యేందు అధికారి తమ్లుక్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న బెదిరింపుల దృష్ట్యా ఇరువురికి భద్రతను పెంచాలని సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వారికి ‘వై +’ కేంద్ర భద్రతను అందిస్తున్నామని, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు వీరి భద్రత పనులను అప్పగించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నలుగురైదుగురు సాయుధ కమాండోలను వారి భద్రతలో మోహరించనున్నట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి.
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భారత్కు ఆహ్వానం
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..