ముంబై, మే 25: ఆన్లైన్ ఫార్మా కంపెనీ ఫార్మ్ఈజీ, తన ప్రత్యర్ధి సంస్థ మెడ్లైఫ్ను టేకోవర్ చేసింది. వేగంగా వృద్ధిచెందుతున్న ఆన్లైన్ ఫార్మసీ రంగంలో ఇది భారీ డీల్ అని, ఈ టేకోవర్తో తమ కంపెనీ ఇండియాలో అతిపెద్ద హెల్త్కేర్ డెలివరీ డెలివరీ ప్లాట్ఫామ్గా రూపొందిందని, ప్రతీ నెలలో 20 లక్షల కుటుంబాలకు సేవలందిస్తామని ఫార్మ్ఈజీ సహ వ్యవస్థాపకుడు ధవాల్షా తెలిపారు. మే 25 నుంచి మెడ్లైఫ్ కార్యకాలాపాల్ని నిలిపివేసి, తన ప్లాట్ఫామ్ను ఫార్మ్ఈజీతో విలీనం చేస్తుందని, మెడ్లైఫ్కు చెందిన కస్టమర్లు, రిటైల్ పార్టనర్లను ఫార్మ్ఈజీ ప్లాట్ఫామ్పైకి తీసుకువస్తామని కంపెనీ వివరించింది. అయితే లావాదేవీ విలువను ఇరు కంపెనీలూ వెల్లడించలేదు. ఫార్మ్ఈజీ మాతృసంస్థ అయిన ఏపీఐ హోల్డింగ్స్లో 19.59 శాతం వాటా మెడ్లైఫ్ షేర్హోల్డర్లకు లభించవచ్చని, దీని విలువ 24 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1750 కోట్లు) ధృవీకరింపబడని వార్తల ద్వారా తెలుస్తున్నది. ఫార్మా తయారీ కంపెనీ ఆల్కెమ్ లాబొరెటరీస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రభాత్ నారాయణ్సింగ్ కుటుంబానికి మెడ్లైఫ్లో అధికవాటా వుంది.