ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది.
శనివారం జరిగిన సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.
శిఖర్ ధావన్(85:54బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సర్లు), పృథ్వీ షా(72: 38 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత ఆటఆటతీరుతో ఆకట్టుకోవడంతో ఢిల్లీ లక్ష్యాన్ని18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని ఓపెనర్లు ఒంటిచేత్తో గెలిపించారు. ఢిల్లీ విజయానికి చేరువలో ఉండగా వీరిద్దరూ ఔటైనా పంత్(15 నాటౌట్) ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్నందించాడు.
అంతకుముందు సురేశ్ రైనా(54:36 బంతుల్లో 3ఫోర్లు,4సిక్సర్లు) అర్ధశతకానికి తోడు మొయిన్ అలీ(36:24 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), శామ్ కరన్(34:15బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌటయ్యాడు.