కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్
అత్యధిక ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గత మూడు నెలల్లో భారత్లో 23వేల మందిని కంపెనీ నియమించుకున్నదని ఫ్లిప్కార్ట్ మంగళవారం తెలిపింది. మార్చి-మే 2021 మధ్య దేశవ్యాప్తంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్లతో సహా వివిధ స్థాయిల్లో కొత్తగా 23వేల మంది ఉద్యోగులను తీసుకున్నట్లు
వెల్లడించింది.
‘కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడంతో ఇ-కామర్స్ సేవలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మా సప్లై చైన్ వ్యవస్థను పెంచుకోవలసి ఉంది. ఇది వేలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యలతో నియామకాలు చేపట్టినట్లు’ సీనియర్ వైస్ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా లాక్డౌన్ విధించడంతో ఇ-కామర్స్ సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.