కేంద్ర ప్రభుత్వం భోజనం మాకొద్దు : రైతులు

న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో గురువారం రెండో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ కలిసి 40 సంఘాలకు చెందిన రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు.
అయితే లంచ్ సమయంలో ప్రభుత్వం వారికి భోజన ఏర్పాట్లు చేసింది. కానీ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని తిరస్కరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే భోజనం, చాయ్లను అంగీకరించమని తెలిపారు. తాము ఇంటి నుంచి భోజనం తెచ్చుకున్నామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
ఈ నెల 1న జరిగిన సమావేశంలో రైతుల అనుమానాలు, సందేహాల నివృత్తి కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రైతులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరోదానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. మరో వైపు రైతుల ఆందోళనకు మద్దతు పెరుగుతోంది.
#WATCH | Delhi: Farmer leaders have food during the lunch break at Vigyan Bhawan where the talk with the government is underway. A farmer leader says, "We are not accepting food or tea offered by the government. We have brought our own food". pic.twitter.com/wYEibNwDlX
— ANI (@ANI) December 3, 2020
తాజావార్తలు
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..