అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్కా దర్శకుడు. 26/11 ముంబయి దాడుల్లో ప్రాణాలర్పించిన దివంగత ఆర్మీ అధికారి సందీప్ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సయి మంజ్రేకర్ కథానాయిక. జూలై 2న విడుదలకానుంది. ఈ చిత్ర టీజర్ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగుతుంది. ధైర్యం మూర్తీభవించిన మేజర్ సందీప్కృష్ణన్ జీవితం అందరికి ఆదర్శం అనే అంశాన్ని చూపిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా