అంబర్పేట, మే 6: కరోనా విజృంభిస్తున్న వేళలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. అంబర్పేట నియోజకవర్గం పరిధిలో నివాసముంటున్న 9 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను గురువారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన అందజేశారు. బాగ్అంబర్పేటకు చెందిన సయ్యద్ అహ్మద్హుస్సేన్, కాచిగూడకు చెందిన పి.రంగారావు, ఆకాశ్నగర్కు చెందిన మస్రత్బేగం, తిలక్నగర్కు చెందిన కె.కృష్ణ, జైస్వాల్గార్డెన్కు చెందిన జి.శ్రీధర్, మారుతీనగర్కు చెందిన ఎస్.పద్మ, బాపూనగర్కు చెందిన ఎండీ అక్బర్, అనంతరామ్నగర్కు చెందిన కె.ప్రవీణ్కుమార్, తులసీరాంనగర్(లంక)కు చెందిన కె.నర్సింగ్రావుకు చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ .. వై ద్యం కోసం అవసరమైన నిధులను సీఎం సహాయ నిధి నుంచి ఎప్పటికప్పుడు అందజేస్తున్నారని పేర్కొన్నారు. రెండో దశ కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభు త్వం, వైద్య, ఆరోగ్యశాఖ సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి దగ్గరే ఉండాలని పేర్కొన్నారు. యూపీహెచ్సీలలో మందులు ఇస్తున్నారని, అక్కడకు వెళ్లి అవసరమైన మందులు తీసుకోవచ్చన్నారు. అందరికి అందుబాటులో ఉన్న ఫీవర్ దవాఖానకు కూడా వెళ్లి అక్కడ చూపించుకోవచ్చని వివరించారు. ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.