రాయ్ పూర్ : పిడుగుపాటుకు గురై మరణించిన యువకుడు తిరిగి సజీవంగా ఉంటాడనే విశ్వాసంతో కుటుంబ సభ్యులు ఆవు పేడతో కూడిన గోతిలో కొద్ది గంటల పాటు పాతిపెట్టారు. చత్తీస్ ఘడ్ లోని సుర్గుజ జిల్లాలో తౌక్తీ తుఫాన్ తో జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
పిడుగుపాటుకు గురై లఖన్పూర్ ముత్కి అనే వ్యక్తి (37) మరణించగా బతికివస్తాడనే నమ్మకంతో కుటుంబ సభ్యులు ఆవు పేడతో చేసిన గోతిలో మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే అప్పటికే అతడు మరణించాడని స్థానిక వైద్యులు డాక్టర్ ప్రిముస్క్ కెర్కెటా వెల్లడించారు.