సోషల్ మీడియా వినియోగం పెరుగడమే కారణం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కొవిడ్-19కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తికి కేంద్రంగా ఉన్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉన్నదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా దుష్ప్రచారానికి సంబంధించి 138 దేశాల ద్వారా ప్రసారమైన 9,657 పోస్టులను పరిశీలించగా వాటిలో అత్యధికంగా 18.07 శాతం పోస్టులు భారత్ కేంద్రంగా పుట్టుకొచ్చినట్టు వివరించింది. దేశంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, ప్రజల్లో ఇంటర్నెట్ అక్షరాస్యత కొరవడటం దీనికి కారణంగా పేర్కొంది. తప్పుడు సమాచారం వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లోనూ భారత్ తొలి స్థానంలో ఉన్నట్టు తెలిపింది.