న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాల కన్నా విశ్వాసాలు గొప్పవి కావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాంవడ్ యాత్ర నిర్వహించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. యాత్ర నిర్వహణపై పునరాలోచించుకోవాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. నిర్ణయం ఏంటనేది 19లోగా చెప్పాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కాంవడ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యాత్రకు ఏర్పాట్లు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.