సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 26: అనుమానించడానికి ఏ కారణం లేకపోతే ప్రత్యక్ష సాక్ష్యమే ఉత్తమ సాక్ష్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మెడికల్, మౌఖిక సాక్ష్యాలతో పొంతన లేనప్పుడు మాత్రమే ప్రత్యక్ష సాక్ష్యాన్ని నమ్మలేకపోవచ్చని పేర్కొంది. గుజరాత్ హైకోర్టు ఒక హత్యకేసులో అప్పీల్పై నలుగురు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించిన తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఆర్ సుభాష్తో కూడిన బెంచ్ కొట్టివేసింది. ఆ నలుగురు దోషులకు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది.