పనాజి, అక్టోబర్ 14: పాకిస్థాన్ అత్రికమణలను, కశ్మీర్లో పౌరుల హత్యలను ప్రేరేపించడం ఆపకపోతే మరిన్ని సర్జికల్ దాడులు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. గోవాలోని ధార్బాందోఢాలో జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేండ్ల కిందటి సర్జికల్ దాడుల్లో పాక్లోని పలు ఉగ్రవాదుల స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.