పాల్ఘర్: మహారాష్ట్రలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. పాల్ఘర్ జిల్లాలోని బోయ్సర్ తారాపూర్ పారిశ్రామిక వాడలో ఉన్న భారత్ కెమికల్స్ లో శనివారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. దీంతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడినవారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎంత మంది గాయపడ్డారనే విషయాన్ని పరిశ్రమ వర్గాలు వెల్లడించడం లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.