వేలేరు, మే 6: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా ఆర్థిక సాయం అందిస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయలక్ష్మి అధ్యక్షతన, ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే మండలంలోని నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా నూతన దుస్తులు, కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అనంతరం గొల్లకిష్టంపల్లి సర్పంచ్ సందేలా పరమేశ్వరి ఆధ్వర్యంలో గ్రామం మీదగా బంగ్లాపల్లి వరకు సుమారు 3.5కిలోమీటర్ల వరకు రూ.1.50కోట్లతో మంజూరైన బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ అంగోత్ సంపత్, కుడా అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ బిల్లా యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు, కోఆప్షన్ సభ్యుడు జానీ, సర్పంచ్లు కొట్టె రాజేశ్, గూడ కవిత, మార్క మల్లిక, జోడుముంతల రమేశ్, మేకల రవీందర్, గుగులోత్ మోహన్, మిలుకూరి అంజమ్మ, మురావత్ అనురాధ, ఎంపీటీసీలు ఇట్టబోయిన సంధ్య, బత్తుల జ్యోతి, గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, ఎంపీడీవో రవీందర్, మండల యూత్ ఉపాధ్యక్షుడు ఎండీ హరీఫ్ పాల్గొన్నారు.
ధర్మసాగర్లో రంజాన్ కానుకల పంపిణీ
ధర్మసాగర్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ సీహెచ్రాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి అనంతరం . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, డీటీ అమరేందర్, జిల్లా కోఅప్షన్ సభ్యురాలు జుబేద, గ్రామస్తులు పాల్గొన్నారు.