పెద్దపల్లి : కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. జిల్లాలోని ధర్మారం మండల నంది మేడారంలోని నంది పంప్హౌస్ రెండు మోటర్ల ద్వారా ఎగువకు ఉరకలు వేస్తున్నది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత నెల 28న పంప్హౌస్లో మోటర్లను ఆన్చేసి ఎల్లంపల్లి బరాజ్లోని నీటిని ఎగువకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రెండు మోటర్ల ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని పక్కనే ఉన్న నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు.
అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రీ పంప్హౌస్కు తరలిస్తున్నారు. ఇక్కడ సైతం రెండు బాహుబలి మోటర్లను ఆన్ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.
కాగా నీటి ఎత్తి పోతలను ఎప్పటికప్పుడు నీటి పారుదల శాఖ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య