క్యూ4లో రూ.7,585 కోట్ల నష్టం
న్యూఢిల్లీ, మే 18: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ లాభాలకు జేఎల్ఆర్ గండికొట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థకు రూ.7,585 కోట్ల నష్టం వచ్చింది. ఆస్తులను రైటాప్ చేయడంతోపాటు జేఎల్ఆర్ పునరుద్దరణ కోసం భారీగా నిధులను కేటాయించడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం మాత్రం రూ.63,057 కోట్ల నుంచి రూ.89,319 కోట్లకు ఎగబాకింది. వాహనాలకు డిమాండ్ ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా మరికొన్ని నెలలు అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని కంపెనీ సీఈవో, ఎండీ గ్యూంటర్ బుచక్ తెలిపారు. గతేడాది మొత్తానికి రూ.2,52,438 కోట్ల ఆదాయంపై రూ.13,395 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.