హైదరాబాద్ : జనవరి 16న కొవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో ఒకే రోజులో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం రికార్డుగా అధికారులు పేర్కొన్నారు. గురువారం నాడు మొత్తం 2,11,244 మందికి కొవిడ్-19 వ్యాక్సిన్లు ఇవ్వగా అందులో 24,787 మందికి సెకండ్ డోస్ లభించగా, మిగిలిన 1,86,457 మందికి మొదటి డోస్ లభించింది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 31,59,780 మందికి కొవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ లభించగా అందులో 2,38,182 మంది ఆరోగ్య కార్యకర్తలు, 2,21,275 మంది ఫ్రంట్లైన్ కార్మికులు, 27,00,323 మంది 45 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
వ్యాక్సినేషన్ బులెటెన్ ప్రకారం 4,42,954 మంది వ్యక్తులు తమ మొదటి, రెండవ డోస్ వ్యాక్సిన్లను పొందారు. ఈ-విన్ పోర్టల్ ప్రకారం.. ఇప్పటివరకు తెలంగాణ 37,24,350 కొవిడ్ వ్యాక్సిన్ డోస్లను పొందింది. 62,970 డోసలు ఆర్మీ సిబ్బందికి, 19,920 డోసులను కొవిడ్ టీకా కేంద్రాలలో(సీవీసీ) అధునాతన షెడ్యూలింగ్ కోసం బఫర్గా పొందారు. తెలంగాణలో గురువారం నాటికి మొత్తం 36,41,460 కొవిడ్ వ్యాక్సిన్లను వినియోగించినట్లుగా 1.06 శాతం వ్యర్థం అయినట్లుగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన బులెటిన్ తెలిపింది.