ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పొకో త్వరలో మొట్టమొదటి 5జీ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. పొకో M3 Pro 5G స్మార్ట్ఫోన్ను మే 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎం3 ప్రొ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తున్నది. ఈ ఫోన్లో అధిక రిఫ్రెష్ రేట్, ర్యామ్, వేగవంతమైన స్టోరేజ్ మాడ్యూల్ను కూడా అందిస్తోంది. ఎం3 ప్రొ మార్కెట్లోకి వచ్చిన తర్వాత X3 మోడల్ ఉత్పత్తిని నిలిపివేయనుంది.
పొకో ఎక్స్ 3 ప్రొ ఇప్పటికే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మూడు కలర్లలో అందుబాటులో ఉండనుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పంచ్ హోల్ కెమెరా కూడా ఉన్నాయి.
‘పొకో ఎం3 ప్రొ 5 జీ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అత్యంత వేగంగా పనిచేస్తుందని’ కంపెనీ ట్వీట్ చేసింది. పొకో ఎం3 ప్రొ 5జీ ఫోన్..రెడ్మీ నోట్ 10 5జీ ఫోన్కు రీ బ్రాండెడ్ వెర్షన్గా విడుదలవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.