పనాజీ: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు గోవాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, గోవా మాజీ ఉప ముఖ్యమంత్రి దయానంద్ నర్వేకర్ (71) కాంగ్రెస్ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై మంచి అభిప్రాయం ఏర్పడిందని, అందుకే తాను ఆప్లో చేరానని నర్వేకర్ చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సుపరిపాలన అందిస్తున్నదని, గోవాలో కూడా అలాంటి పాలన తీసుకురావాలని భావిస్తున్నదని దయానంద్ నర్వేకర్ తెలిపారు. కరోనా మహమ్మారి వేళ గోవా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల వెన్నంటే ఉన్నదని, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు. నర్వేకర్ గోవాలోని అల్డోనా అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 నవంబర్ నుంచి 2000 అక్టోబర్ వరకు గోవా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.