అమరావతి : ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. రైతులు పొలాల వద్దకు వెళ్లవద్దని, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తరాంధ్ర, గోదావరి కృష్ణా, గుంటూర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని సాయంత్రం వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.