చెన్నై: హోటల్లో ఫుడ్కు ఆర్డర్ చేసిన ఒక పోలీస్ అధికారి డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు కస్టమర్లను లాఠీతో కొట్టాడు. దీంతో ఆ హోటల్ యజమాని దీనిపై ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఒక హోటల్కు వచ్చిన ఎస్ఐ ఫుడ్కు ఆర్డర్ ఇచ్చాడు. డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు హోటల్లో ఉన్న కస్టమర్లపై లాఠీతో కొట్టి బయటకు వెళ్లగొట్టాడు. ఈ క్రమంలో ఒక మహిళకు లాఠీ దెబ్బ తగలడంతో ఆమె ఏడ్చింది.
ఇదంతా హోటల్లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా ఆ ఎస్ఐపై హోటల్ యజమాని సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు లంచాల కోసం తమను వేధించడంతోపాటు బెదిరిస్తున్నారని ఆరోపించారు.