బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ‘ఈటా’ వేరియంట్ కరోనాను గుర్తించారు. దీనికి సంబంధించి ఒక కేసు తాజాగా నమోదైంది. నాలుగు నెలల కిందట దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అతడి నమూనాలను జీనోమ్ సిక్వెన్స్ కోసం లాబ్కు పంపగా ‘ఈటా’ వేరియంట్ (B.1.525)గా గురువారం గుర్తించారు. కాగా ఈ కరోనా వేరియంట్ దేశంలో కొత్తది కాదు. ఈ ఏడాది జూలైలో మిజోరంలో ‘ఈటా’ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం ‘ఈటా’ వేరియంట్ కరోనాను తొలుత 2020 డిసెంబర్లో యూకే, నైజీరియాలో గుర్తించారు. అయితే దీనిని ఏ దేశంలో మొదట గుర్తించారన్నది డబ్ల్యూహెచ్వో వెల్లడించలేదు. కాగా, ‘ఈటా’ను ఆసక్తి కలిగిస్తున్న వేరియంట్గా ఈ ఏడాది మార్చి 17న పేర్కొంది. E484K, F888L రెండు ఉత్పరివర్తనలు ఉన్న ‘ఈటా’ వేరియంట్ మిగతా వేరియంట్ల కన్నా భిన్నమని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ‘ఈటా’ వేరియంట్ ప్రస్తుతం భారత్తో సహా 23 దేశాలకు విస్తరించింది.