కరీంనగర్ : కొవిడ్-19పై పోరాటంలో మాల్యాల మండలానికి చెందిన దమ్మయపేట దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో గ్రామంలో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. గ్రామస్తులు అనుసరించే ముందు జాగ్రత్త చర్యలే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. దమ్మయపేట తన నియోజకవర్గంలో ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు.
గ్రామన్ని శనివారం సందర్శించిన ఎమ్మెల్యే గత ఏడాది కాలంగా గ్రామస్తులను కొవిడ్-19 బారిన పడకుండా తీవ్రంగా కృషి చేసిన సర్పంచ్ తునికి నర్సయ్యను ప్రశంసించారు. వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించినందుకు సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్ను ఆయన సత్కరించారు.
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. ఫంక్షన్లతో సహా సామూహిక సమావేశాలకు దూరంగా ఉండటం, ఫేస్ మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు గ్రామస్తులను వైరస్ నుండి దూరంగా ఉంచడానికి సహాయపడ్డాయన్నారు. దమ్మయపేటను ఆదర్శంగా ఇతర గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.